ధర్మారం, నవంబర్18: మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, వృద్ధు లు, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ధర్మారానికి చెందిన సాయిమిత్ర టైలరింగ్ షాప్ గ్రూప్ మహిళలకు రిజిస్ట్రేషన్ పత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, కుట్టు శిక్షణ పొందిన అనంతరం టైలరింగ్ దుకాణం ఏర్పాటు చేసుకున్న సాయిమిత్ర మహిళా బృందాన్ని ఆయన ప్రశంసించారు.
మహిళలు ఇంటికే పరిమితం కావద్దని, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళలు శిక్షణను సద్వినియో గం చేసుకుని స్కూల్ యూనిఫాంలు కుట్టేస్థాయికి ఎదగడం ఎంతో అభినందనీయమన్నారు. సం ఘం రిజిస్ట్రేషన్ ఉన్నందున గురుకులాలు, ఇతర పాఠశాలల యూనిఫాంలు కుట్టడానికి టెండర్లు వేయవచ్చని సూచించారు. కాగా, మంత్రి ఈశ్వర్, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీకి సంఘం అధ్యక్షురాలు దేవి రేణుక, ఉపాధ్యక్షురాలు వసంత, ప్రధాన కార్యదర్శి సుంచు స్వప్న, ధర్మారం ఉప సర్పంచ్ లతకు కృతజ్ఞతలు తెలిపారు.