వెల్గటూర్, జూన్ 19 : చెగ్యాం ఆర్అండ్అండ్ కాలనీ నూతన పోచమ్మ ఆలయంలో నాలుగు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాలకు టీఆర్ఎస్ నాయకుడు పొనుగోటి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.
సర్పంచ్ రామిళ్ల లావణ్యతో కలిసి మంత్రి బోన మెత్తుకున్నారు. అమ్మవారికి సమర్పించి, ప్రజలంతా చల్లంగా ఉండాలని కోరుకున్నారు.