గొల్లపల్లి, జనవరి 1: తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలిలో 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంను ప్రా రంభించారు. 1.5కోట్లతో చేపడుతున్న చిల్వకోడూర్- స్తంభంపల్లి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయాచోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు.
ప్రభు త్వం రైతాంగం అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. ఈ దిశగా 24 గంటల ఫ్రీ కరెంట్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలు చే స్తున్నదని చెప్పారు. పండించిన పంట ఉత్పత్తులను మద్దతుధరతో కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేసి వీ టిద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నదని తెలిపారు. పంట ఉత్పత్తులను నిల్వచేసుకొనేందుకు గోదాముల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు అలిశెట్టి రవీందర్, కందుకూరి పద్మావతి రవీందర్, జడ్పీటీసీ జలంధర్, ప్యాక్స్ అధ్యక్షుడు మాధవరావు, ఎంపీటీసీలు మహబూబ్, అశోక్, మార్కెట్కమిటీ చైర్మన్ కాంపెల్లి హన్మాండ్లు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అంజద్ పాల్గొన్నారు.