కరీంనగర్ రూరల్, నవంబర్ 26: కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, బీజేపీ, కాంగ్రెస్లకు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పాలన వచ్చి అరిగోస పడుతామని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్, ఇరుకుల్ల, వల్లం పహాడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గజమాలలతో సన్మానించారు. మంత్రి ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పుకొన్న బండి సంజయ్కి నేడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
అవినీతి పరుడివి కాకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే కోట్ల రూపాయలు వసూలు చేసి, నేడు ఓట్లను డబ్బులతో కొనాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్లుగా ఎంపీగా ఉండి కరీంనగర్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో మహిళలు నిలదీయాలన్నారు. ఓట్లు వేయించుకొని మాయమయ్యే వ్యక్తి బండి సంజయ్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ను ఓడించేందుకు దొంగలంతా ఏకమయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద దొంగ అని, ఆయనకు ఓటేస్తే, మీ భూములను మాయం చేస్తాడని ఆరోపించారు. ఆంధ్రా నాయకులు బీజేపీ, కాంగ్రెస్ రూపంలో ఒక్కటయ్యారని, వాళ్లని నమ్మి ఓటు వేస్తే తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతలు మొదలవుతాయని తెలిపారు. తెలంగాణ చీకటి మయమవుతుందన్నారు.
తాను ఎల్లప్పుడూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అండగా నిలిచానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే గ్రామాల రూపురేఖలు మారాయని, కోట్లాది రూపాయల నిధులతో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించుకుందామన్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచులు గాజుల వెంకటమ్మ, బలుసుల శారద, జక్కం నర్సయ్య, ఉప్పుల శ్రీధర్, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఎంపీటీసీ గోలి రాజ్యలక్ష్మి, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు, ముత్యాల శంకర్ గౌడ్,
అంకమల్ల శ్రీనివాస్, సాయిల వినయ్సాగర్, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ గోనే నర్సయ్య, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు నెరెళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీరామోజ్ తిరుపతి, బుర్ర రమేశ్గౌడ్, పరశురాములు, మండల కో ఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, నాయకులు జువ్వాడి రాజేశ్వర్రావు, తోట తిరుపతి, కోరుకంటి వేణుమాధవ్రావు, గాజుల అంజయ్య, ఆకుల కిరణ్కుమార్, రాజ్కమల్, కుమార్, రవీందర్, నెరెళ్ల మహేశ్, గాజుల హరికృష్ణ రాజ్కమల్, జవ్వాడి మారుతి రావు, మంద రాజమల్లు, రమేశ్, మూస్కు మల్లారెడ్డి, కూర రంగారెడ్డి, పబ్బతి రంగారెడ్డి, మంద తిరుపతి, పెద్ది రమేశ్, బలుసుల శంకరయ్య, బోగ రాజ్కుమార్, బోగ తిరుపతి, వీణవంక రమేశ్, ప్రసాద్, పరశురాములు, రవి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.