కొత్తపల్లి, జూలై 28 : కొత్తపల్లి పట్టణ పద్మశాలీ మార్కండేయ గుడి అభివృద్ధికి సహకారమందిస్తానని పౌర సరఫరాల, బీసీ సంక్షేమశాఖల మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పద్మశాలీ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాసాల రమేశ్, నాయకులు మంత్రి గంగుల కమలాకర్ను శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కండేయ గుడి అభివృద్ధికి రూ. 25 లక్షలు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
స్పందించిన మంత్రి గుడి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. నిధుల మంజూరుకు హామీ ఇచ్చిన మంత్రిని పద్మశాలీలు శాలువాతో సత్కరించారు. ఇక్కడ పద్మశాలీ సంఘం నాయకులు స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, మారండేయ గుడి చైర్మన్ అనుమల్ల సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు రుద్ర రాజేశం, కార్యవర్గ సభ్యులు మెరుగు మల్లేశం. నందాల శ్రీనివాస్, సామల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్ పాల్గొన్నారు.