కరీంనగర్ : చొప్పదండి సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమాచారం అందగానే హుటాహుటిన కరీంనగర్ కలెక్టర్ ని ఫోన్లో సంప్రదించిన మంత్రి అత్యవసర చర్యలు తక్షణం తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ద్వారా వివరాలు సేకరించిన మంత్రి మధ్యాహ్నం భోజనంలో క్యాబేజీ కూర వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని తెలుసుకున్నారు. వంద మంది వరకు అస్వస్థతకు గురి కాగా అందులో 35 మందిని కరీంనగర్ దవాఖానకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారని మంత్రి తెలిపారు.
మిగతా వారికి స్థానికంగా అందుబాటులోనే మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని, అందరూ కోలుకుంటున్నారని ఆరోగ్యంగానే ఉన్నారని తల్లిదండ్రులకు భరోసానిచ్చారు.
ఎవరు ఆందోళన చెందవద్దు అన్నారు. జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడం వలన సుమారు 100 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.