మంథని, డిసెంబర్ 25: మానవాళి ఏసు క్రీస్తు బోధనలను పాటించి ప్రశాంత జీవనం సాగించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంథనిలోని బేతేలు గాస్పెల్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి శ్రీధర్బాబు హాజరయ్యారు. క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు దీవెనలు, క్రైస్తవుల సహకారంతో తనను మంథని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించారని, రాష్ట్రంలోనూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకునే శక్తి ఆ ప్రభువు అందించేలా ప్రార్థించాలని మంత్రి పాస్టర్లను కోరారు.
మంథని ప్రాంతంలో సైతం ఐటీ, ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికాబద్ధంగా తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవులకు ప్రభుత్వం తరపున అందించే క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు కొండ శంకర్, ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కౌన్సిలర్ పెండ్రి రమాదేవి, కాంగ్రెస్ నాయకులు శశిభూషణ్ కాచే, మూల సరోజన, ఇనుముల సతీశ్, ఐయిలి ప్రసాద్, వొడ్నాల శ్రీనివాస్, పెండ్రు సురేశ్ రెడ్డి, రావికంటి సతీశ్, పాస్టర్లు, సంఘం పెద్దలు, క్రైస్తవులు పాల్గొన్నారు.
మంథని/మంథని రూరల్, డిసెంబర్ 25: పట్టణంలోని సీయోను, హెబ్రోన్, బేతేలు, క్యాథలిక్, గ్లోరియస్, ఆర్సీఎంలతో పాటు దుబ్బపల్లిలోని శక్తి మినిస్టరీస్, ధర్మారం, ఆరెంద, గుమునూరు, మల్లారం, సిరిపురం, చిల్లపల్లి, సూరయ్యపల్లి, గాజులపల్లి, బిట్టుపల్లి, తోటగోపయ్యపల్లిలతో పాటు ఆయా గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో పాస్లర్లు, మత పెద్దలు క్రిస్టియన్లతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. పలు చర్చిల్లో చిన్నారులు, యువతుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో కౌన్సిలర్ పెండ్రి రమా సురేశ్ రెడ్డి, గాజులపల్లి సర్పంచ్ కారెంగుల సుధాకర్, కాంగ్రెస్ నాయకుడు శశిభూషణ్ కాచే, పాస్టర్లు వల్లూరి ప్రభాకర్, పెండ్రు ప్రసన్న కుమార్, శ్రీనివాస్పాల్, కరుణాపాల్, సంఘ పెద్దలు అంకరి కుమార్, మంథని ప్రసాద్, చింతకుంట్ల ప్రేమ్ కుమార్, అందె రమేశ్, ఈర్ల సదానందం, రామగిరి కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
కోల్సిటీ, డిసెంబర్ 25: క్రిస్మస్ను సందర్భంగా క్రైస్తవులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ని వివిధ చర్చిల్లో పాస్టర్లు సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నగరంలోని పలు చర్చిలను అందంగా అలంకరించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సతీమణి మనాలి పలు చర్చిలకు వెళ్లి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. గోదావరిఖని విఠల్ నగర్, ఫైవింక్లయిన్, గాంధీనగర్లో గల ప్రధాన చర్చిలతోపాటు స్థానిక సెక్రెట్ హార్ట్ చర్చిలలో వేడుకలు అంబరాన్ని అంటాయి. వివిధ చర్చి పాస్టర్ల అసోసియేషన్లు వేర్వేరుగా నిర్వహించిన వేడుకల్లో పాస్టర్లు, చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఫర్టిలైజర్సిటీ, డిసెంబర్ 25: గౌతమినగర్లోని గ్లోరియస్ మినిస్ట్రీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ హాజరయ్యారు. క్రిస్మస్ కేట్ కట్చేసి స్వీట్లు పంపిణీ చేశారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ కార్పొరేటర్లు మహకాంళి స్వామి, ఎండీ ముస్తాఫా, కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నాయకులు, పాస్టర్లు నిరీక్షణ్, జోసెఫ్, సెబాస్టియన్ ఫ్రాంక్, బ్రదర్ సన్నీ, కంతి వినోద్, ఈదునూరి రవి, ధూళికట్ట సతీశ్, విపుల్ పాల్గొన్నారు.
జ్యోతినగర్, డిసెంబర్ 25: ఫైట్ ఫర్ బెటర్ సోసైటీ ఆధ్వర్యంలో రామగుండంలోని తబితా ఆశ్రమంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆశ్రమ పిల్లలకు కొత్త బట్టలు పంపిణీ చేశారు. చర్చి ఫాస్టర్ జోసెఫ్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్, ప్రధానకార్యదర్శి గడుప శ్రీకాంత్, జోయెల్ డేవిస్, ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్ నాయక్ ఉన్నారు. రామగుండం బీ కాలనీలోని బెతనీయ చర్చిలో వేడుకలో ఫాస్టర్ చంటిపాల్, తిమోతి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పెద్దపల్లి కమాన్, డిసెంబర్ 25: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో క్రైస్తవులు సోమవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సీఎస్ఐ, బేతెల్ చర్చిలతో పాటు పలు చర్చిల్లో క్రిస్మస్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు క్రీస్తు బోధనలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రెవరెండ్ యు. సుధాకర్, సెక్రటరీ చింతల వసంత వరకుమార్, డీసీ మెంబర్ బండ సదానందం, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ధర్మారం,డిసెంబర్25: మండలంలోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ధర్మారంలోని యెహోవా ఈరె చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. చర్చి నిర్వాహకులు, క్రైస్తవులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. ప్రతి రోజు తన సతీమణి ప్రేయర్ చేస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బ్రదర్ జర్మియా, చర్చి మెంబర్ ప్రభాకర్, నర్సింగాపూర్ ఎంపీటీసీ బద్దం అజయ్పాల్ రెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఓదెల, డిసెంబర్ 25: మండలంలోని గోపరపల్లి బేతస్థ చర్చితో పాటు కొలనూర్, గుంపుల, పొత్కపల్లి, ఓదెల, కనగర్తి, జీలకుంటలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిల్లో కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో ఐఎంఐ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు, పాస్టర్ బొంగాని సదయ్యగౌడ్, దొడ్డె స్వామి, బొంగాని రాజయ్యగౌడ్, సాగర్, సుమన్, శ్యాం, పాల్గొన్నారు.
జూలపల్లి, డిసెంబర్ 25 : జూలపల్లి, కుమ్మరికుంట, వడ్కాపూర్, పెద్దాపూర్లోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దారబోయిన నరసింహం కేక్ కట్ చేశారు. ప్రభుత్వం క్రైస్తవులకు సరఫరా చేసిన బట్టలను పంపిణీ చేశారు.ఇక్కడ నాయకులు కొమ్మ పోశాలు, ఏదుల్ల కన్కయ్య, నెరువట్ల ఆనంద్ పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్,డిసెంబర్25 : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, చర్చి ఫాదర్లు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.