కమాన్చౌరస్తా, మార్చి 25 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 27న బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీ శ్రీలక్ష్మి, టీఎస్కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ శోభారాణి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఇందులో భాగంగా 2021 నుంచి 2024 వరకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు రెస్యూం, సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం 99120 93500లో సంప్రదించాలని చెప్పారు.