సారంగాపూర్, అక్టోబర్ 8: దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్గా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం బీర్పూర్ మండల కేంద్రంలో రూ. 20 లక్షల నిధులతో చేపట్టే పైపులైన్ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి నూతనంగా నిర్మించిన ఎంఆర్సీ భవనాన్ని ప్రారంభించారు. తుంగూర్ గ్రామం నుంచి దొంతాపూర్కు రూ.1.80 కోట్ల తో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. తుంగూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు.
కమ్మునూర్ గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించే పంచాయతీ కార్యాలయ భవనానికి భూమి పూజ చేశారు. మంగెళ గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అన్నా రు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఎలా ఉంది..? తెలంగాణ రాకముందు అభివృద్ధి ఎలా ఉందో..? ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.
గ్రామాల అభివృద్ధికి జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. ఆడబిడ్డ పెం డ్లికి దేశంలో ఏ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయడం లేదని, కేవలం తెలంగాణలో మాత్రమే కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా నూట పదహార్లు అందిస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడా లేని విధంగా జీతాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల బాగుకోసం నిరంతరం శ్రమిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరా రు.
కార్యక్రమాల్లో ఎంపీపీ మసర్తి రమేశ్, జడ్పీటీసీ పాత పద్మ-రమేశ్, జిల్లా కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ కొల్ముల రమణ, మండల కన్వీనర్ మేరుగు రాజేశం, వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నారపాక రమేశ్, ప్రదాన కార్యదర్శి శీలం రమేశ్, ఉపాధ్యక్షులు రామకిష్టు గంగాధర్, శ్రీనివాస్రావు, మండల యూత్ అధ్యక్షుడు గాజర్ల రాంచంద్రం గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్ల మైపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు గర్షకుర్తి శిల్ప, రిక్కల ప్రభాకర్, ఎడ్ల సృజన, గుడిసె శ్రీమతి జితేందర్ యాదవ్, మెసు ఏసుదాసు, ఎలగందుల లక్ష్మి, బందెల మరియా, చిక్రమ్ సుగుణ, నారపాక రమ, పర్వతం రమేశ్, అజ్మీరా ప్రభాకర్, చుంచు శారద, మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్, ముక్క వెంకటేశ్ యాదవ్, దూలూరి వంశీ, హరీశ్, కృష్ణారావు, ఆయా గ్రామాల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగిత్యాల, అక్టోబర్ 8: జిల్లా కేంద్రంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన ప్రెస్క్లబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతను జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.