రాంనగర్, జనవరి 30: పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో సోమవారం మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బా రా యుడుతో పాటు పలువురు పోలీసు అధికారులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేటి తరానికి మహాత్ముడి మార్గం అనుసర ణీయ మని చెప్పారు. కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఏవో వైవీ ముని రామయ్య, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, పరిపాలన వి భాగం సూపరింటెండెంట్లు పార్వతి, ఏవీఎన్ చా రి, ఇన్స్పెక్టర్లు లక్ష్మీబాబు, సృజన్రెడ్డి, ఆర్ఎస్ఐ లు సురేశ్ కుమార్, మురళి, రమేశ్ ఉన్నారు.
‘సర్వోదయ’ ఆధ్వర్యంలో అన్నదానం
కార్పొరేషన్, జనవరి 30: సర్వోదయ నవ ని ర్మా ణ సమితి ఆధ్వర్యంలో గాంధీరోడ్లోని గాంధీ విగ్రహం ఎదుట ఏర్పాటు అన్నదానం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు మెండి చంద్రశేఖర్, సంస్థ అధ్యక్షుడు పెద్ది లక్ష్మీ నారాయణ, వ్యవస్థాపకులు తోట లక్ష్మణ్రావు, ప్రధాన కార్యదర్శి సామ నారాయణ, ఉపాధ్యక్షులు పాత వెంకట నర్సయ్య, కొం తం కృష్ణమూర్తి, కటూరి సుధాకర్, శ్రీనివాసగాంధీ, శ్రీనివాస్, జోగినపల్లి రఘునందన్రావు, పద్మ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 30: పట్టణంలోని బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షుడు పొన్నం సత్యనారాయణ, 6 వార్డు కౌన్సిలర్ గున్నాల విజయా రమేశ్ గాం ధీ విగ్రహానికి పూలమాలలు నివాళుల ర్పించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు కన్న అంజిబా బు, పొన్నం శ్రీనివాస్, ముత్యం గణపతి, కె లక్ష్మ ణ్, నర్ల పోచాలు, గుర్రం అనిల్, అభిషేక్, ఆర్ అనిల్, నల్ల సంతోష్, వివేక్ పాల్గొన్నారు.
విద్యానగర్, జనవరి 30 : గాంధీ వర్ధంతిని పురసరించుకుని వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో 2 కే రన్ను నిర్వహించారు. స్థానిక సరస్ గ్రౌం డ్, గీతా భవన్ చౌరస్తా నుంచి రన్ ప్రారం భించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో వాసవి వనిత క్లబ్ పీఎస్టీ డాక్టర్ ఎలగందుల సౌ మ్య, హోమియో కేర్ కృప, అరుణ ఉన్నారు.
కమాన్చౌరస్తా, జనవరి 30: గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ వి ద్యాసంస్థల్లో చైర్మన్ నరేందర్రెడ్డి ఆ యన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించా రు. ఇక్కడ అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.