ముకరంపుర, అక్టోబర్ 28: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ క్షేత్ర స్థాయిలో సమస్యలను సత్వరమే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు అధికారులను ఆదేశించారు. కరీంనగర్ సరిల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఎన్పీడీసీఎల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులతో అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన సరఫరాకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని సూచించారు.
సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యాసంగి సీజన్ కోసం నాణ్యమైన నిరంతర సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రేక్ డౌన్ వైఫల్యాలను నియంత్రించాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం, మరమ్మతుల్లో జాప్యం లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. స్టాక్ పొజిషన్పై సమీక్షించారు. వినియోగదాల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిషరించాలని ఆదేశించారు.
ఓవర్ లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిషారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యం మేరకు విద్యుత్ బిల్లులు వసూళ్లు చేస్తూ రెవెన్యూను పెంచాలని సూచించారు. అనంతరం జిల్లా స్టోర్స్ను పరిశీలించారు. సమావేశంలో డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, గణపతి, మోహన్రెడ్డి, సీజీఎంలు రాజీవ్ హన్, ప్రభాకర్, సంధ్యారాణి, తిరుపతిరెడ్డి, డీఈ(టెక్నికల్) అనిల్కుమార్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల ఎస్ఈలు గంగాధర్, సుదర్శనం, సత్యనారాయణ, డీఈలు శివరాములు, తిరుపతి, రవి, విజేందర్రెడ్డి, చంద్రమౌళి, రాజం, తిరుపతి, లక్ష్మీరెడ్డి, కాళిదాసు, గోపికృష్ణ, గంగారాం, రాజిరెడ్డి, తిరుపతి, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.