గంభీరావుపేట, నవంబర్ 1: కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. తొమ్మిదిన్నరేండ్లల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిద్దాం. ప్రతిపక్షాల అబద్ధపు మాటలను క్షేత్రస్థాయిలో తిప్పికొడుదాం. మంత్రి కేటీఆర్ను లక్షకు పైగా మెజార్టీతో గెలిపించుకుందాం’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రతి వంద ఓటర్లకు ఒక్క కార్యకర్త ఇన్చార్జిగా వ్యవహరించాలని, అభివృద్ధి, సంక్షేమంతోపాటు నూతన మ్యానిఫెస్టో గురించి వివరించాలని సూచించారు. 2001లో పరిస్థితులు, గులాబీ జెం డా పుట్టిన తర్వాత దశల వారీగా మారిన పరిస్థితులు, స్వరాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలన్నారు. కరంట్, సాగు, తాగునీరు, విద్యా, వైద్యం కోసం ఉమ్మడి పాలనలో ప్రజలు పడిన కష్టాలను ఒక్కసారి మనం వారికి గుర్తు చేయాలన్నారు. అప్పటి, ఇప్పటి పాలనను ఒకసారి ఆలోచించి, అభివృద్ధి చేస్తున్న మంత్రి కేటీఆర్కు అండగా నిలిచేలా ఓట్లు అభ్యర్థించాలని సూచించారు.
నాడు 3 గంటలు, నేడు 5 గంటల కరంట్ ఇస్తామన్న కాంగ్రెస్ నేత ల మాటలను తిప్పికొడుతూ, ఆదర్శంగా రాష్ట్రంలో మనం అందిస్తున్న 24గంటల నిరంతర కరెంట్పై వివరించాలన్నారు. ధరణితో 95శాతం భూ యజమానులకు మేలు జరిగిందన్నారు. కొంతమంది భూస్వాములు, పెత్తందారులకు ఇబ్బందిగా మారినంత మాత్రాన ధరణి పోర్టల్ను తీసివేయాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బీమా, సన్న బియ్యం, సౌభాగ్య లక్ష్మి, పెరుగుతున్న పింఛన్లు, రైతుబంధు తదితర పథకాలపై ఓటర్లకు అవగాహన చేయాలన్నారు.
వచ్చే నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని, అవి కూడా కీలకమని చెప్పారు. అనంతరం మున్నూరుకాపు సంఘం యూత్ సభ్యులు తోట ఆగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్ కటకం శ్రీధర్, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, ఏఎంసీ చైర్మన్ కొత్తింటి హన్మంతరెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు లక్కిరెడ్డి లతారెడ్డి, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, లింగన్నగారి దయాకర్రావు, కమ్మరి రాజారాం, గంద్యాడపు రాజు, వెంకటియాదవ్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నా యి. తిరిగి వారికి ఒకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత బూత్స్థాయి కార్యకర్తలపై ఉంది. హింసకు తావులేకుండా గాంధేయ మార్గంలో కేసీఆర్ హయాంలో రాష్ర్టాన్ని సాధించుకున్నాం. హింసాత్మక ధోరణితో అధికారంలోకి వచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం అందించిన పథకాలపై లబ్ధిదారులకు క్లుప్తంగా వివరించాలి. కార్యర్తలు సమన్వయంగా ప్రచారంలో ముందుకుపోవాలి. కేటీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్