తెలంగాణచౌక్,మార్చి 30: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగరణి దర్శన్ పేరిట కోల్ మైన్స్ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రారంభించింది. ఇందుకు ప్రతిశనివారం ప్రత్యేక బ స్సు సర్వీసును నడుపుతున్నది. గురువారం క రీంనగర్ ఆర్ఎం ఖుస్రోషాఖాన్ వివరాలు వెల్లడించారు. ఈ స్పెషల్ బస్సు హైదరాబాద్లోని జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి కరీంనగర్ మీదుగా గోదావరిఖనిలోని సింగరేణి గనులకు చేరుకుంటుంది. పర్యాటకులు అండర్ గ్రౌండ్ గనులు, ఓపెన్ కాస్ట్లు, ఎస్టీపీపీ విద్యుత్ ప్లాంట్ను సందర్శించిన అనంతరం సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి కరీంనగర్ మీదుగా తిరిగి 6.30 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది.
జూబ్లీ నుంచి బస్ టికెట్ ఒక్కొక్కరికీ 2 వేలు, కరీంనగర్ నుంచి వెయ్యి ఉంటుందన్నారు. ఈ ప్యాకేజీ కోసం టికెట్లను జూబ్లీ, కరీంనగర్ బస్స్టేషన్లలోని రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద గానీ, ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. సింగరేణి దర్శన్కు వెళ్లేవారు 18 సంవత్సరాలు నిండి ఆరోగ్యవంతులై ఉండాలన్నారు. మహిళలు జీన్స్, కుర్తాలు, పైజామా లాంటి వస్ర్తాలు మాత్రమే ధరించాలని సూచించారు. వ్యక్తిగతంగా బాం డ్ మీద సంతకం చేయాల్సి ఉంటుందని, గనుల్లోకి వేళ్లే ముందు తప్పకుండా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ సింగరేణి అధికారులకు అందించాల్సి ఉంటుందని కోరారు.