Land issues | పెద్దపల్లి రూరల్ జూన్ 16 : భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్, తుర్కల మద్దికుంట గ్రామాల్లో సోమవారం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతుల నుంచి వారికి ఉన్న భూ సమస్యలపై ధరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రాజయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో చాలా కాలంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల భూముల సమస్యల పరిష్కారానికి భూ భారతి కార్యక్రమంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని ఈ సదస్సులను వినియోగించుకుంటూ సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని బాధితుల భూములకు సర్వహక్కులు పొందేందుకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాయిబ్ తహసీల్దార్ విజేందర్, భానుకుమార్, వెంకటరాజిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.