Devulapalli | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 3 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవులపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నoబులాద్రి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని పూజారులు మంగళవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబలి, పుష్పయాగం, ఏకాంత సేవ, చక్రతీర్థంతోపాటు తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
దేవునిపల్లి ,కోదురుపాక గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై క్యూలైన్ ద్వారా మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్ల కుమారస్వామి, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అట్లా శ్రీనివాస్, ఉపసర్పంచులు వానరాసి వీరస్వామి, తిరుపతిరావు, డైరెక్టర్లు సాగర్, బాలకృష్ణ, సతీష్, కుమార్, గోపాలరావు, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ రావు, మురళీధర్ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.