Chintal Thana | వేములవాడ : వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి (మృతుని పేరు మురళి) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సోమవారం పరామర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ పాల్గొన్న అభ్యర్థి, ఎన్నికల ఫలితాలకు కొద్ది రోజుల ముందు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
అయితే, గ్రామంలో ఆయన చేసిన సేవలు, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతో చింతలఠాణా ప్రజలు మరణించిన ఆయనకే భారీ మెజారిటీతో ఓటు వేసి సర్పంచ్గా గెలిపించారు. ఈ నేపథ్యంలో చింతలఠాణాకు సోమవారం చేరుకున్న కేటీఆర్, మరణించిన సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.