అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం కార్మిక క్షేత్రమైన సిరిసిల్లకు రానున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం రెండు గంటలకు సిరిసిల్ల పట్టణానికి చేరుకుంటా రు.
మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పట్టణంలో నిర్వహించే రోడ్షోలో పాల్గొంటారు. అమాత్యుడి రోడ్షో సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
– రాజన్న సిరిసిల్ల, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ)