గోదావరిఖని, మార్చి 5: బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని, లోక్సభ ఎన్నికల అనంతరం పార్టీ పుంజుకుంటుందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే చందర్ నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్నారు. స్వార్థరాజకీయాల కోసం పార్టీ నుంచి వెళ్లినవారితో నష్టమేమీ లేదన్నారు. పార్టీ నుంచి ఎందుకు వెళ్లామా అని.. వారు కూడా తమ తప్పును గుర్తించే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
గత ఎన్నికల్లో ప్రజలు స్థానికంగా మార్పు కోరుకున్నారే గానీ.. కేసీఆరే సీఎంగా ఉండాలని అనుకున్నారన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నార ని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధం గా ఉన్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షే మ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా పని చేయాలని, తన గెలుపునకు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు పాల్గొన్నారు.