గంగాధర, సెప్టెంబర్ 27: ఆదర్శనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లిలో బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, పొట్టల కనకయ్య, నాయకులు దూలం శంకర్గౌడ్, రామిడి సురేందర్, తోట మల్లారెడ్డి, ఆముల రమణారెడ్డి, వేముల అంజి, అలువాల తిరుపతి, చిలుముల రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. మధురానగర్లో మార్కండేయ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సిరిసిల్ల ప్రసాద్, దూస లక్ష్మీనారాయణ, చెన్నూరి శంకర్, ఇప్పలపెల్లి శంకరయ్య, పోల సమ్మయ్య, ఉడుత శ్రీనివాస్, బోగ లక్ష్మీనారాయణ, ఒడ్డెపెల్లి అశోక్, వేముల రవి, అయిట్ల రవి, ఇప్పలపెల్లి రాజయ్య, పొరండ్ల భూపతి తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, సెప్టెంబర్ 27: ఆర్నకొండలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పద్మశాలీ సంఘం మండలాధ్యక్షుడు మచ్చ రమేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎనగందుల రాజేశం, దూస భూమయ్య, గౌడ ఆనందం, చిందం భూపతి, రుద్దుల మల్లేశం, మచ్చ సత్యనారాయణ, ఎన్నం శంకరయ్య, పోలు రవి, ఎనగందుల వెంకటేశం, మచ్చ శ్రీనివాస్, ఎనగందుల మధు, ఎనగందుల సాయి, పోలు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, సెప్టెంబర్ 27: నేటి తరానికి ఆదర్శప్రాయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు పేర్కొన్నారు. గోపాల్రావుపేటలోని పద్మశాలీ సంఘ భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఆయన పద్మశాలీ కులస్తులతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పద్మశాలీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక కమలాకర్, గోపాల్రావుపేట మారెట్ కమిటీ డైరెక్టర్లు మచ్చ గంగయ్య, కొలిపాక మల్లేశం, పద్మశాలీ సంఘం నాయకులు సిరిపురం సత్య నారాయణ, మచ్చ లచ్చయ్య, మామిడాల పరశురాములు, కొలిపాక నాగరాజు, నల్ల అంజయ్య, బూర్ల రామచంద్రం, కొలిపాక రాములు, లక్ష్మణ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్, అజయ్, రుద్ర రాజు, సుధాకర్, తిరుమల్, రవి, వెంకటస్వామి, ఇస్తారి, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 27: కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పూల మాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఎంపీటీసీ వెంగళదాసు శ్రీనివాస్, ఏఈ రమణారెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ సంపత్కుమార్, కరీంనగర్ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వర్రావు, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, వైద్యురాలు ఇందు, ఏపీవో శోభ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాంనగర్, సెప్టెంబర్ 27: పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సీపీ సుబ్బారాయుడు, పోలీసు ఉన్నతాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. అడిషనల్ డీసీపీలు రాజు, లక్ష్మీనారాయణ, ఏవో మునిరామయ్య, ఏసీపీలు విజయ్కుమార్, ప్రతాప్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్స్పెక్టర్, ఐటీ సెల్ ఇన్చార్జి సరిలాల్, ఆర్ఐలు సురేశ్, రజినీకాంత్, కుమారస్వామి, శేఖర్ బాబు, శ్రీధర్రెడ్ది, సీపీవో కార్యాలయ సెక్షన్లకు చెందిన సూపరింటెండెంట్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, సెప్టెంబర్ 27: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది సరితారెడ్డి, మల్లయ్య, రాజమల్లయ్య, గౌతమి, పవన్, లక్ష్మి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, సెప్టెంబర్ 27: తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ అభినవ బాపూజీగా, ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని కలెక్టర్ డాక్టర్ బీ గోపి కొనియాడారు. నగరంలోని కలెక్టరేట్లో బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాగా, బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ చేసిన ఉద్యమాల స్ఫూర్తితోనే మలిదశ తెలంగాణ పోరులో లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్, సీపీవో కొమురయ్య, డీఏవో శ్రీధర్, సివిల్ సైప్లె డీఎం సురేశ్రెడ్డి, డీటీవో నాగరాజు, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, సెప్టెంబర్ 27: తెలంగాణ ఏర్పాటు కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగం మరువలేనిదని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గవ్వ వంశీధర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బాపూజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి, ఉద్యమంలో పాల్గొన్నారని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంపల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం నేత పెంట అజయ్, నాయకుడు దాచుపల్లి వంశీకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.