Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 15 : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున డీజేలు పెట్టి యువతతో పాటు ప్రజలు ఆగమనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ఆగమనం కార్యక్రమంలోనూ కేసీఆర్ పాటలతో ఊరు వాడ దద్దరిల్లింది. వేములవాడ పురపాలక సంఘం పరిధి తిప్పాపూర్లో యంగ్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఆగమనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భారీగా లైటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా స్లైడ్స్ కూడా ఏర్పాటు చేసి చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా కేసీఆర్ పాటతో పాటు డిజిటల్ స్లైడ్స్ లో ఒకవైపు కేసీఆర్, ఒకవైపు కేటీఆర్ చిత్రాలను కూడా ప్రదర్శిస్తూ యువకులు చిందులు వేస్తూ హంగామా చేశారు. ఆగమనంలోనూ కేసీఆర్ పాట మరోసారి ఊరు వాడ పట్నం అని తేడా లేకుండా ప్రజలు చిందులేసిన తీరు ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని నిరూపించారు.