Ramagiri | రామగిరి, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాపుర బోయిన భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాణాసంచాలు కాల్చి, కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు కేసీఆర్కి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చూపిన దూరదృష్టిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, మేదరబోయిన కుమార్ యాదవ్, నాగేలి సాంబయ్య, పుల్లెల కిరణ్, జోవహర్, మాజీ జడ్పీటీసీ శారద, మాజీ వైస్ ఎంపీపీ కాపురాబోయిన శ్రీదేవి, మండల అధ్యక్షురాలు ఆశా కుమారి, అరుణ, అశ్విని, స్వాతి, అర్చన,వాణి, శంకరమ్మ,ఉదయ్, ఇబ్రహీం, శ్రీనివాస్ రెడ్డి, రాజన్న, ప్రశాంత్, సదానందం, మని, అశోక్, బోకూరి పోశం,అసం తిరుపతి, ఆరు యాదవ్, గోపాల్, సంతోష్, గండి శ్రీనివాస్, గిటుకు శ్రీనివాస్, రొడ్డ శ్రీనివాస్, శ్రీకాంత్, మగబుల్,కాట అనిల్, సుదీర్, రాజేష్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.