ప్రముఖ కవి, నవలా రచయిత రేగులపాటి కిషన్ రావు(77) అస్తమించారు. ఏడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గురువారం ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు. ఎన్నో నవలలు, కథా, కవిత్వ సంకలనాలు వెలువరించిన ఆయన, గొప్ప రచయితగా గుర్తింపు పొందారు. ఆయన మృతికి పలువురు కవులు సంతాపం ప్రకటించారు.
కమాన్చౌరస్తా, జనవరి 5: కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన రేగులపాటి కిషన్ రావు(77) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఇప్పటికి నాలు గు నవలలు, ఆరు కథా సంకలనాలు, 13 కవిత్వ సంకలనాలు వెలువరించారు. సంఘసంసరణ అభ్యుదయ భావాలతో ఆయన రచనలు సాగాయి. 1976లో ‘ఆమె వి తంతువు కాదు’.. 1978లో ‘పతివ్రత ఎవరు’.., 1981లో ‘సంఘర్షణ’.. 1982లో ‘ప్రేమకు పెం డ్లెప్పుడు’.. అనే నవలలు, కథలను ఆ కాలంలో విరివిగా రాశారు.
కాగా, గత ఏడేళ్లుగా అనారోగ్యంతో దా దాపు మంచం పైనే ఉన్నారు. ఆయన భార్య రేగులపాటి విజయలక్ష్మి కూడా ఆయన స్ఫూర్తితో రచనలు చేశారు. ఆయన 1946 డిసెంబర్ 1న ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణాలో జన్మించారు. 1970 నుంచి 2004 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కరీంనగర్ రాంనగర్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన మృతికి జిల్లా కవులు నివాళులర్పించారు. వారిలో డాక్టర్ నలిమెల భాసర్, మాడిశెట్టి గోపాల్, కొత్త అనిల్, గండ్ర లక్ష్మణ్రావు,గాజుల రవీందర్, నందిశ్రీనివాస్ తదితరులు ఉన్నారు.