కరీంనగర్ మెడికవర్ దవాఖాన వైద్యుల ఘనత
విద్యానగర్, జూలై 11: కరీంనగర్ మెడికవర్ దవాఖాన వైద్యులు శతాధిక వృద్ధురాలికి తుంటి ఎముక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశా రు. అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర నేతృత్వంలోని వైద్యబృందం రిస్క్ ఎక్కువగా ఉన్నా సర్జరీ చేశారు. ఆదివారం దవాఖానలో వివరాలు వెల్లడించారు.
గన్నేరువరం మండలం జంగపల్లికి చెందిన బొజ్జ పోచవ్వ (100) ఈ నెల 3న ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డది. ఆమె కొడుకులు చికిత్స కోసం మెడికవర్ దవాఖానకు తీసుకువచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ఆమె ఊపిరితిత్తులు, గుండె బలహీనంగా ఉన్నదని, ఆపరేషన్ చేయ డం ఎంతో రిస్క్ అని కుమారులతో చెప్పారు. అయితే వారీ అంగీకారం మేరకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశామని చెప్పారు. ఆపరేషన్ సమయంలో 5 యూ నిట్ల రక్తం ఎక్కించామని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని చెప్పారు. కాగా ఆపరేషన్ను విజయవంతం చేసిన వైద్యులకు పోచవ్వ కొడుకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అనస్థీషియన్ విన య్, అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్, సూపరింటెండెంట్లు డాక్టర్ రీటా, రోహిణి, నాగరాజు ఉన్నారు.