గంగాధర, జూన్ 28: తరగతి గదిలోనే దేశ భవిష్యత్ ఉందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా గంగాధర ప్రభుత్వ పాఠశాలలో రూ.30 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభు త్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించి నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు. గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం రూ.4 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గదుల మరమ్మతు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల ఏర్పాటు, డైనింగ్ హాల్ తదితర వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దాతలు ముందుకు వచ్చి సర్కారు బడుల్లో సౌకర్యాల కల్పనకు చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్రెడ్డి, జోగు లక్ష్మీరాజం, ఎండీ నజీర్, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, నాయకులు దోమకొండ మల్లయ్య, వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, ఆకుల మధుసూదన్, తాళ్ల సురేశ్, వడ్లూరి ఆదిమల్లు, గంగాధర కుమార్, గుండవేని తిరుపతి, సముద్రాల ఓంకార్, పెంచాల చందు, అఖిల్ పాల్గొన్నారు.
రైతుబంధు దేశానికే ఆదర్శం
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తున్న సందర్భంగా మధురానగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్రెడ్డి, జోగు లక్ష్మీరాజం, ఎండీ నజీర్, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, నాయకులు మల్లయ్య, అంజి, శ్రీనివాస్, మధుసూదన్, సురేశ్, ఆదిమల్లు, కుమార్, తిరుపతి, ఓంకార్, చందు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.