చొప్పదండి, జూన్ 24: చొప్పదండి ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం రైతులకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి కోరారు. సంఘం ఆవరణలో చైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో మూడు నెలల జమాఖర్చులపై చర్చించగా సభ్యులు ఆమోదం తెలిపారు. సంఘం ద్వారా ఏడు గ్రామాల్లో కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలు వెల్లడించారు. సంఘం ద్వారా 1,26,726 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైస్మిల్లర్లకు తరలించామని చైర్మన్ తెలిపారు. కొనుగోళ్ల ద్వారా సంఘానికి రూ. 40 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కొనుగోళ్లు విజయవంతం చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సంఘం ద్వారా రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కావలసిన వారు సంఘ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సంఘం ద్వారా రా రైస్మిల్లు నిర్మాణం చేసి, వచ్చే నెలలో పనులు ప్రారంభించాలని తీర్మానించారు. సంఘం ద్వారా వ్యక్తిగత, ఆస్తుల తనఖాపై ఇచ్చిన అప్పులు వాయిదా మీరినందున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పాలవర్గసభ్యులు తెలిపారు. సమావేశంలో వైస్చైర్మన్ ముద్దం మల్లేశం, డైరెక్టర్లు గుర్రం ఆనందంరెడ్డి, గుర్రం సునంద, కళ్లెం లక్ష్మారెడ్డి, నాంపల్లి మల్లయ్య, మంగ్లారపు మల్లారెడ్డి, లంబు రాజిరెడ్డి, సత్తు నర్సయ్య, కొమురయ్య, దుర్గం పద్మ, కోసన తిరుపతిరెడ్డి, కార్యదర్శి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.