కార్పొరేషన్, జూన్ 7: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపడుతున్న సమీకృత మారెట్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమీకృత మారెట్ల నిర్మాణం, ఫుట్పాత్ల ఆక్రమణలు, హరితహారం, ఐలాండ్, రానున్న వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి మంత్రి సమీక్షించారు. పట్టణాల్లో చేపట్టిన సమీకృత మారెట్లను త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు సమీకృత మారెట్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా చూడాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై వ్యాపారం చేసే వారిని మారెట్లకు తరలించాలన్నారు.
వానకాలంలో మురుగు ప్రవహించడం వల్ల బీటీ రోడ్లు చెడిపోతున్నాయని, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కరీంనగర్-సిరిసిల్ల రోడ్డును రూ.80 కోట్లతో పూర్తి చేస్తున్నామని, ఈ రోడ్డులో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి కమాన్, తెలంగాణ తల్లి చౌరస్తా వరకు మెయిన్ ఎంట్రన్స్ ఆహ్లాదంగా, అద్భుతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చౌరస్తాల ఐలాండ్లను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మారెట్ల వద్ద పారింగ్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాలను జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ మానేరు రివర్ ఫ్రంట్కు ఇరువైపులా మొకలు నాటాలన్నారు.
సుడా అనుమతి లేకుండా మానేరు రివర్ ఫ్రంట్ సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పకన అక్రమ నిర్మాణాలు జరుగకుండా ప్రత్యేకాధికారులను నియమించి పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్, ఉప్పల్ తర్వాత కరీంనగర్ జిల్లాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై సునీల్రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.