శంకరపట్నం, మే 28: మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో జూన్ 2 వరకు గ్రామీణ క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని అడిషనల్ డీఆర్డీవో జీ సంధ్యారాణి ఆదేశించారు. శనివారం ఆమె జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, మండలస్థాయి అధికారులతో కలిసి కేశవపట్నం, తాడికల్, అంబాల్పూర్, ఎరడపల్లి, అర్కండ్ల, కన్నాపూర్, ధర్మారం, ముత్తారంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హరితహారంలో నాటిన మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఆరు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించి, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులను సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్ర అవతరణ రోజున క్రీడా ప్రాంగణాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మండలస్థాయి అధికారులను ఆదేశించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో ప్రతిభ గల స్థానిక క్రీడాకారులు వెలుగులోకి వస్తారని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆకాంక్షించారు. ఇక్కడ తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్రావు, ఎంపీడీవో జయశ్రీ, గిర్దావర్ లక్ష్మారెడ్డి, ఏపీవో శారద, సర్పంచులు రంజిత్రావు, స్వప్న, రవి, రేణుక, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.