మల్లాపూర్, మే 28: దళితబంధు యూనిట్లను దక్కించుకున్న దళితులు వ్యాపారాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. శనివారం ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మండలంలోని వేంపల్లి, ఓబులాపూర్, మల్లాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.90 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో గ్రామానికి చెందిన ఆకుతోట ప్రతిభ దళితబంధు యూనిట్ కింద ఏర్పాటు చేసుకున్న ఐరన్ హార్డ్వేర్ దుకాణాన్ని ప్రారంభించారు. ఓబులాపూర్, వాల్గొండ గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు కలాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పుట్టిపెరిగిన సీఎం కేసీఆర్కు ప్రజల కష్టాలు తెలుసునని, ఈ నేపథ్యంలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు మనఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. అర్హులందరూ పథకాల ఫలాలను అందిపుచ్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో వాటికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఇక్కడ ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, అడిషనల్ పీడీ నరేశ్, తహసీల్దార్ రవీందర్, ఇన్చార్జి ఎంపీడీవో జగదీశ్, ఎంఈవో గంగాధర్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల జీవన్రెడ్డి, సర్పంచులు బిట్ల సరోజన, జోగుల మమత, అలిశెట్టి రవి, ఎంపీటీసీలు గుగ్లావత్ భూమి, తోట సుజాత, ఆకుతోట రాజేశ్, విద్యాకమిటీ చైర్మన్లు రొడ్డ రాజ్కుమార్, ఎదులాపురం శంకర్, ఎస్కే ముస్తాక్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దేవర సురేశ్రావు, గ్రామశాఖ అధ్యక్షులు బండి లింగస్వామి గౌడ్, సకినపల్లి శంకర్ ఉన్నారు.