కోల్సిటీ, మే 28: మహిళలు సమతుల ఆహా రం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ పేర్కొన్నారు. రుతు సమయంలో సైతం ఎలాం టి సమస్యలు ఎదురుకావని చెప్పారు. మహిళలు ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు త్వరలోనే సర్కారు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచ రుతు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా రామగుండం నగ రపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆరోగ్యం గా ఉన్నప్పుడే సమాజం కూడా ఆరోగ్యంగా ఉం టుందన్నారు. మహిళలకు సులభంగా అందుబాటులో ఉండేందుకు నగరంలో శానిటరీ నాప్కిన్ వెండింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలని, ముం దుగా మున్సిపల్ కార్యాలయంలో ప్రవేశపెట్టాలని సూచించారు.
నగర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో మెడికల్ కళాశాలకు అనుబంధంగా పెద్ద దవాఖాన ఉంటుందన్నారు. ప్రస్తుతం ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రా లుండగా మరో రెండు బస్తీ దవాఖానలు ప్రారంభిస్తామని చెప్పారు, నాబార్డ్ ఆధ్వర్యంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద పచ్చళ్ల తయారీపై మహిళలకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బిస్కెట్లు, ఇతర వస్తువుల తయారీలోనూ శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆసక్తి గల వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
శిక్షణ అనంతరం మహిళలు పరిశ్రమల స్థాపనకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నా ణ్యమైన నాప్కిన్లను వినియోగించాలని మహిళలకు సూచించారు. ఉపయోగించిన న్యాప్కిన్లతో కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని బల్దియా సిబ్బందికి సూచించారు. నగర పాలక సంస్థ కమిషనర్ సుమన్రావు రుతు పరిశుభ్రతపై స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ నారాయణరావు, మెప్మా డీఎంసీ రజనీ, టీఎంసీ శ్వేత, నాబార్డ్ ప్రతినిధులు భవాని, ఆర్య,వాసు,మెప్మా ఆర్పీలు ఉన్నారు.