పారిశ్రామిక ప్రాంతంలోని ఖని దవాఖాన సరికొత్తగా మారుతున్నది. సకల సౌకర్యాలు సమకూర్చుకుంటున్నది. ఇప్పటికే 125 పడకలతో రోగులకు సేవలందిస్తుండగా, కొత్తగా రూ.7కోట్ల వ్యయంతో 50 బెడ్స్తో అదనపు విభాగం ఏర్పాటైంది. మంగళవారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకోసం అహర్నిశలూ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు.
– ఫర్టిలైజర్సిటీ, మే 24