మానకొండూర్ రూరల్, మే 12: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ.. ప్రభుత్వ ఫలాలను గడపగడపకూ వెళ్లి అందిస్తున్న ఎమ్మెల్యే రసమయికు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. తిలకం దిద్ది.. మంగళహారతులతో తమ ఇండ్లలోకి స్వాగతం పలుకుతున్నారు. గురువారం రసమయి బాలకిషన్ మానకొండూర్ మండలం ముంజంపల్లి, ఖాదర్గూడెం, నిజాయితీగూడెం, చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, శంషాబాద్, వన్నారం గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించగా, మురిసిపోయిన ఆడబిడ్డలు చక్కెర కుడుకలు పోసి ఆత్మీయతను చాటుకుని, కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సుడిగాలి పర్యటన చేశారు. గురువారం వేకువజామునే బైక్పై మానకొండూర్ మండలం ముంజంపల్లి, ఖాదర్గూడెం, నిజాయితీగూడెం, చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, శంషాబాద్, వన్నారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో బైక్ పై కలియదిరిగారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి చెక్కులు అందజేసి, సారె పెట్టారు. తమ ఇంటి వద్దకే ఎమ్మెల్యే వచ్చి చెక్కులు ఇవ్వడంతో మురిసిపోయిన మహిళలు, ఎమ్మెల్యేకు తిలకం దిద్ది, మంగళహారతులతో స్వాగతం పలికారు. గట్టుదుద్దెనపల్లిలో పర్కాల సుజాత-ఎల్లయ్య కుటుంబం ఎమ్మెల్యేకు చక్కెర కుడుకలు పోసి అభిమానాన్ని చాటుకున్నారు. ముంజంపల్లికి చెందిన ఉప్పరి రవి, గట్టుదుద్దెనపల్లికి చెంది న అల్లెపు పోచయ్య కొడుకు ఇటీవల మృతి చెం దగా, వారి కుటుంబాలను పరామర్శించారు.
పేదింటికి అండగా సీఎం కేసీఆర్
పేదింటి కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండ గా నిలుస్తున్నారని, కల్యాణలక్ష్మితో భరోసా నింపుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంతో ఆడబిడ్డల ముఖాల్లో సంతోషం కనిపిస్తున్నదన్నారు. నిరుద్యోగుల కల నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ భారీగా ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్లు వేశారని, యువతీయువకులు స మయాన్ని వృథా చేయకుండా ప్రిపేర్ కావాలని సూచించారు. ఇంకా పలు గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వెంటనే పరిష్కరించారు. సర్పంచులు రామంచ గోపాల్రెడ్డి, సాయవేని రాజు, బొల్ల వేణు, బొల్ల మురళి, దేవ సతీశ్రెడ్డి, పొలాడి కవిత-వంశీధర్రావు, ఎంపీటీసీలు కనవేణి శ్రీనివాస్, గడ్డి రేణుక-గణేశ్, ఆకుల నర్సింగరావు, జడ్పీటీసీ శేఖర్గౌడ్, ఉప సర్పంచులు పిట్టల కుమారస్వామి, శ్రీకాంత్, బుద్దుల తిరుపతి, ఓసీ జేఏసీ నాయకుడు పొలాడి రామారావు, నాయకులు దయ్యాల అనిల్గౌడ్, కాసం బ్రహ్మారెడ్డి, గాజర్ల మల్లారెడ్డి, కొత్త వెంకటరెడ్డి, బండ విజేందర్రెడ్డి, బాలెంకి మల్లేశం, పిల్లి మల్లయ్య, దుర్గం నర్సయ్య, కుంట శ్రీనివాస్, ఎల్లుగొండ మొగిలి, ఎరుకల శ్రీనివాస్గౌడ్, నెల్లి శంకర్, గంగుల రవి, ఎండీ గౌస్, రహ్మద్ అలీ, పార్నంది కిషన్ ఉన్నారు.