కార్పొరేషన్, ఆగస్టు 15: జిల్లా వ్యాప్తంగా ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంఘాలు, విద్యాసంస్థలు, అన్ని పార్టీల కార్యాలయాలు, ప్రధాన చౌరస్తాల్లో జాతీయ జెండా ఎగురవేసి, వందనం చేశారు. నగరంలోని మంత్రి మీ సేవా కార్యాలయం వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండా ఎగురవేశారు. మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్లు గంట కళ్యాణి, గందె మాధవి, నాయకులు చల్ల హరిశంకర్, మేచినేని అశోక్రావు, కర్రె సూర్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ వై సునీల్రావు జాతీయ జెండా ఎగురవేసి, వందనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో రూ. 347 కోట్లతో అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లు, నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుడా కార్యాలయంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు జెండా ఎగురవేశారు. వైస్ చైర్మన్ క్రాంతి, సలహా కమిటీ సభ్యులు ఉదారపు మారుతి, వంగర రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ క్యాంపు కార్యాలయంలో మేయర్ వై సునీల్రావు జెండా ఎగురవేశారు. కార్పొరేటర్ వాల రమణారావు, నాయకులు సాయికృష్ణ, సంపత్ పాల్గొన్నారు.
మున్నూరు కాపు సంక్షేమ సంఘంలో కో-కన్వీనర్ చల్ల హరిశంకర్ జాతీయ జెండా ఎగురవేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు. రాంనగర్లోని ఆటో యూనియన్ వద్ద సంఘం నాయకుడు చల్ల హరిశంకర్ జెండా ఆవిష్కరించారు. బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, నాగభూషణం, మొండయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ ఏరియాలోని వాటర్ ట్యాంక్లో టీఆర్ఎస్ కార్మిక విభాగం, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్, రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో, బస్టాండ్ సమీపంలోని ఫోర్ వీలర్స్ అసోసియేషన్, ఆటో స్టాండ్ యూనియన్, భవన నిర్మాణ కార్మికుల సంఘం, జీప్ క్వాలీస్ డ్రైవర్ అసోసియేషన్, 33వ డివిజన్లోని చైతన్య, గణేశ్ యూత్ క్లబ్, జైభీమ్ యూత్ క్లబ్, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మేయర్ వై సునీల్రావు పాల్గొని జెండా ఎగురవేసి, వందనం చేశారు.
కార్యక్రమాల్లో ఆయా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మూడో డివిజన్లో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ జెండా ఎగురవేశారు. నాయకులు పెండ్యాల మహేశ్కుమార్, దొమ్మటి శంకర్, ప్రసాద్, గసికంటి శ్రావణ్, మోహన్, అస్మా తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ జెండా ఎగురవేశారు. మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, నాయకులు సయ్యద్ బరత్అలీ, సయ్యద్ కమ్రొద్దీన్, మహ్మద్ అఖిల్ ఫిరోజ్, మహ్మద్ శర్ఫొద్దీన్, అతీఫ్ అతీనా, సయ్యద్ ముఖద్దర్ హుస్సేన్, అలీబాబ, అజర్ దబీర్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్, ఆగస్టు 15: ఎందరో దేశభక్తుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకురావడం అభినందనీయమని అన్నారు. దళిత బంధు పథకం కరీంనగర్ జిల్లా నుంచి చేపట్టడం శుభ సూచకమని పేర్కొన్నారు. అనంతరం ఆయన విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, ఆగస్టు 15: నగరంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ జడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి జెండా ఎగురవేశారు. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, అంబేద్కర్చౌక్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ జెండా ఎగురవేశారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్రెడ్డి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని అభినందించారు. బ్రాహ్మణవీధిలోని బృందావన్ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆయూబ్ జెండా ఎగురవేశారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో జ్యోతినగర్లోని కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు సముద్రాల జనార్దన్ రావు జెండా ఎగురవేశారు. సంఘం గౌరవాధ్యక్షుడు వుచ్చిడి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంగీత, సాంస్కృతిక సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు గోగుల ప్రసాద్ జెండా ఎగురవేశారు. ఇక్కడ ప్రధాన కార్యదర్శి సల్వాజి ప్రవీణ్, చిలువేరు శ్రీకాంత్, కనపర్తి శ్రీనివాస్, సిద్ధి రమేశ్, గొల్లపల్లి రవీందర్ పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్ మల్లేశం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఓఎస్డీ రమేశ్, రిజిస్ట్రార్ భరత్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా జైలులో ఇన్చార్జి జైల్ సూపరింటెండెంట్ భరత్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జైలర్ పీ సంజీవరెడ్డి, బీ రమేశ్, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. బొమ్మకల్ రోడ్డులోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు జెండా ఎగురవేశారు. పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్సీకి ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ వీర్ల మహేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోర్టుచౌరస్తా, ఆగస్టు 15: జిల్లా కోర్టు సముదాయంలో జడ్జి ఎంజీ ప్రియదర్శిని జాతీయ పతాకావిష్కరణ చేశారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బీ రఘునందన్రావు, జూపల్లి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు. న్యాయమూర్తులు కృష్ణమూర్తి, వాణి, శివజ్యోతి, మాధవికృష్ణ, సుజయ్, సాయిసుధ, చందన, ప్రదీప్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆవునూరి అశోక్కుమార్, కార్యదర్శి భీమాసాహెబ్, కోశాధికారి జెల్ల రమేశ్, మహిళా ప్రతినిధి భాగ్యలక్ష్మి, పెంచాల ప్రభాకర్రావు, ముబీన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
విద్యానగర్, ఆగస్టు 15: రెనే దవాఖానలో చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈసందర్భంగా డాక్టర్ బంగారి స్వామి బీఆర్ అంబేద్కర్, డాక్టర్ మల్లారెడ్డి జవహార్లాల్ నెహ్రూ, శ్రీకాంత్ మహాత్మాగాంధీ, ఎం శ్రీనివాస్ అల్లూరి సీతారామరాజు, ఏ సంపత్కుమార్ ఆర్మీ జవాన్, రాజేందర్యాదవ్ భగత్సింగ్, అరుణ్కుమార్ సుఖ్దేవ్, ఉమేశ్కుమార్ లాల్బహుదూర్ శాస్త్రి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెనే దవాఖాన వైస్ చైర్మన్ డాక్టర్ వీకేజీ రాజశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బంగారి రజినీప్రియదర్శిని, చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ డాక్టర్ రవిమల్లారెడ్డి, వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యానగర్, ఆగస్టు 15: ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల జెండా ఎగురవేశారు. ఆర్ఎంవో డాక్టర్ శౌరయ్య, ఏవో నజీముల్లాఖాన్, వైద్యులు నవీన, గంగాధర్, వసీం, ఉద్యోగులు పుల్లెల సుధీర్, భారతి, ఆకుల ప్రభాకర్, వైద్య ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్-1లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు అఫ్తాబ్ అహ్మద్ఖాన్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రూప్సింగ్, నాయకులు శ్రీనివాస్ కర్ణ, టీ శ్రీనివాస్, ఎండీ అజీజ్, నర్సింగరావు, రవీందర్, రఫీ మహ్మద్, అఫ్రోజ్, సుమతి, హనుమంతరెడ్డి పాల్గొన్నారు. అపోలో రీచ్ దవాఖానలో నిర్వహించిన వేడుకల్లో దవాఖాన పరిపాలన అధికారి డాక్టర్ ప్రమోద్గుప్తా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 19వ డివిజన్లో నిర్వహించిన వేడుకల్లో కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, డివిజన్ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాంనగర్, ఆగస్టు 15: కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సత్యనారాయణ, పరిపాలన కార్యాలయంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్ జెండా ఎగురవేశారు. అడిషనల్ డీసీపీ (ఎల్అండ్వో) ఎస్ శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఉమేశ్కుమార్, ఇన్స్పెక్టర్లు జయేశ్ రెడ్డి, మల్లేశం, జానీమియా, మురళీ, శేఖర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. పీటీసీలో ప్రిన్సిపాల్ సునీతామోహన్, వైస్ ప్రిన్సిపాల్ శివభాసర్ జెండా ఎగురవేశారు. అడిషనల్ డీసీపీ చంద్రయ్య, వైస్ ప్రిన్సిపాల్ రవి, డీఎస్పీలు కాశయ్య, గంగాధర్, ఏసీపీ నాగేందర్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, త్రిముక్, సురేశ్, మాధవి, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హౌసింగ్బోర్డుకాలనీ, ఆగస్టు 15: తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్ జెండా ఎగురవేశారు. జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలసంకుల అనంతరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంఏ రజీ, కరీంనగర్ నియోజకవర్గ కన్వీనర్ అనువోజు శ్రీకాంత్, బెహ్రాన్ తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు ప్రభాకర్, విద్యార్థి విభాగం జిల్లా కో-కన్వీనర్ సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు