జగిత్యాల, ఏప్రిల్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిళ్లు నిరుపేద నిరుద్యోగులకు వరంలాంటివని, వీటిని యువత ఉపయోగించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. జగిత్యాల పట్టణం బీట్ బజారులోని ఎస్సీ స్టడీ సరిల్ను శనివారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి సందర్శించారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న క్రమంలో ప్రతి విద్యార్థి పుస్తకాలతో కుస్తీ పట్టాలని, సమకాలీన అంశాలను తెలుసుకునేందుకు నిత్యం వార్తా పత్రికలు, కాంపిటేటివ్ మ్యాగజైన్లు చదివి కరెంట్ అఫైర్స్, ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలని, సమాజంపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. జోన్ల మార్పు ద్వారా స్థానికులకే ఎక్కువ అవకాశాలు ఉన్నందున యువత అందిపుచ్చుకోవాలన్నారు.
జగిత్యాల జిల్లాకు బీసీ స్టడీ సరిల్ మంజూరుకావడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రూ.10 వేల విలువైన స్టడీ మెటీరియల్ ఆర్యవైశ్య సంఘ పట్టణాధ్యక్షుడు మంచాల కృష్ణ అందించగా, వాటిని ఎమ్మెల్యే విద్యార్థులకు అందజేశారు. అంతకు ముందు స్టడీ సెంటర్ విద్యార్థుల కోసం తయారు చేసిన అల్పాహారం, భోజనం తీరును పరిశీలించి, అకడే అల్పాహారం చేశారు. ఇక్కడ ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజ్ కుమార్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు నారపాక రమేశ్, శ్రీనివాస్రావు, బండారి విజయ్, డైరెక్టర్ నరేశ్, కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.