వస్తువుల కొనుగోళ్లలో మోసం జరిగితే న్యాయ పోరాటం చేయాలి
అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్
కరీంనగర్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): వినియోగదారులు తమ హకులను తెలుసుకోవాలని, కొనుగోళ్లలో మోసం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాటం చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల హకుల దినోత్సవాన్ని పురసరించుకొని వినియోగదారుల సమాచార కేంద్రం, జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల హకులపై వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కొనుగోళ్లలో, తూకంలో తేడా వస్తే సంబంధిత దుకాణ యజమాని నిలదీయాలన్నారు. నష్ట పరిహారం పొందాలని, తిరిగి కొత్త వస్తువులు తీసుకోవాలని సూచించారు. న్యాయమైన డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూసుకోవాలని, మోసాలకు తావులేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల హకులను వివరిస్తూ ముద్రించిన పోస్టర్ను అదనపు కలెక్టర్ ఆవిషరించారు. ఏసీపీ విజయసారథి, వినియోగదారుల సమాచార కేంద్రం కో-ఆర్డినేటర్ లక్ష్మణ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్రెడ్డి, తూనికలు, కొలతల శాఖ అధికారి రవీందర్, డీపీవో వీర బుచ్చయ్య, కరీంనగర్ వినియోగదారుల మండలి అధ్యక్షుడు కోల రామచంద్రారెడ్డి, ప్రకాశ్హోల్లా, సయ్యద్ ముజఫర్, ఆర్ వెంకటేశ్వరరావు, అరుణ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.