సిరిసిల్ల రూరల్/ఇల్లంతకుంట, నవంబర్ 22: పనికి వస్తావా అంటూ.. వెంట తీసుకువెళ్లి వివస్త్రను చేసి హింసించి లైంగిక దాడికి యత్నించిన కామాంధుడిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇల్లంతకుంట మండలం ఒగులాపూర్కు చెందిన గంట తిరుపతి(39) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నెల 15న సిరిసిల్లలోని లేబర్అడ్డాలో పని కోసం వచ్చిన మహిళను చూసి, ఎలాగైనా అనుభవించాలన్న ఉద్దేశంతో పని ఉందని మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఒగులాపూర్ శివారులోని గుట్టల ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెకు బలవంతంగా బీరు తాగించి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె తిరుపతి చెర నుంచి తప్పించుకుని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం విచారణ చేపట్టారు. ఎట్టకేలకు వారం రోజులకు నిందితుడిని పట్టుకున్నారు. మంగళవారం ఒగులాపూర్ గ్రామపంచాయతీ ప్రాంతంలో తిరుపతిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ ఉపేందర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మహేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.