రామడుగు, నవంబర్ 22: పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలానికి చెందిన 25 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసంలో మంగళవారం ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన బాధితులకు సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేయడం జరిగిందన్నారు. పేదలకు ఎక్కడా సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ అంటే ప్రజలకు తెలిసేది కాదన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకుంటున్న నియోజకవర్గాల్లో చొప్పదండి ముందువరుసలో నిలుస్తుందన్నారు.
అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడుకునేందుకు ఎల్వోసీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ప్రజలు తనను సంప్రదిస్తే సీఎంఆర్ఎఫ్తో పాటు ఎల్వోసీ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎడవెల్లి పాపిరెడ్డి, నాగుల రాజశేఖర్గౌడ్, పూడూరి మల్లేశం, పురాణం రమేశ్, తడగొండ అజయ్, బీ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.