కరీంనగర్ రాంనగర్, నవంబర్ 22 : మహిళకు భరోసా కల్పించేందుకు ఉమెన్ హెల్ప్ డెస్ మరింత దోహదపడుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మహిళలు, చిన్నారులు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా పోలీస్స్టేషన్లకు వచ్చి చెప్పుకునేలా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, రిసెప్షనిస్టులకు ఉమెన్ హెల్ప్ డెస్ విధులపై రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, బాధిత మహిళలను గౌరవంగా సంబోధించే వాతావరణం కల్పిస్తూ తమ సమస్యను నిర్భయంగా చెప్పుకునేలా, న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని సూచించారు. ప్రతి పోలీస్స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్ల ద్వారా బాధిత మహిళల పట్ల సున్నితంగా, స్నేహ పూర్వకంగా ఎలా వ్యవహరించాలో సిబ్బందికి శిక్షణలో నిర్దేశించామని తెలిపారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ జీ చంద్ర మోహన్, సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఎస్పీ వినోద్కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సీటీసీ ఇన్స్పెక్టర్ మాధవి, వుమెన్ పీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాల అన్ని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలు పాల్గొన్నారు.