గంభీరావుపేట, నవంబర్ 19: గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి వినూత్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం చాటుకున్నాడు. వృత్తి రీత్యా వడ్రంగి అయిన ఆయన, టేకు కర్రపై సీఎం ప్రతిమను తీర్చిదిద్దాడు. వారం రోజుల సమయంలో రోజువారీగా తనకు సమయం దొరికినప్పుడల్లా ప్రతిమ తయారీలో నిమగ్నమయ్యాడు. శనివారం పూర్తి కావడంతో ప్రతిమను చూసి ఆనందపడ్డాడు. అవకాశం వస్తే ముఖ్యమంత్రికి నేరుగా అందిస్తానని అన్నాడు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి అభిమానిగా మారిపోయానని సంతోషంగా చెప్పాడు.