కార్పొరేషన్, నవంబర్ 19: తెలంగాణతోపాటు యావత్ దేశంలో పేరెన్నికగన్న నుమాయిష్ ఎగ్జిబిషన్ను త్వరలోనే కరీంనగర్లో ప్రప్రథమంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏటా హైదరాబాద్లోని నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సాగే ఈ కార్యక్రమాన్ని మొదటిసారి హైదరాబాద్ వెలుపల ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్వాహకులతో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చర్చలు జరిపారు. ఆ మేరకు కరీంనగర్లో నిర్వహించేందుకు నిర్వాహకులు ముందుకు వచ్చారు. అందులో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేదర్ స్టేడియంలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. 82ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఇప్పటివరకూ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారని, చరిత్రలో మొదటిసారి హైదరాబాద్ వెలుపల కరీంనగర్లో నిర్వహించేందుకు ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, చల్ల హరిశంకర్, నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ మార్గం, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాశంకర్, సెక్రటరీ సాయినాథ్ దయాకర్, సభ్యులు వీ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.