విద్యానగర్, ఫిబ్రవరి 3 : క్యాన్సర్… ఈ వ్యాధి పేరు వింటే చాలు, కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదురోవాలి. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమ యం పడుతుందో కూడా చెప్పలేం. క్యాన్సర్ ప్రా ణాలను సైతం బలితీసుకుంటుంది. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు ఇలా శరీరంలోని వివి ధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది. మన దేశంలో క్యాన్సర్ గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. ముదిరిన దశలో వ్యాధిని గుర్తించడం వల్ల పరిస్థితి చేజారుతోంది. కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడానికి వీలుంది. నేడు (ఫిబ్రవరి 4) ప్రపంచ క్యాన్సర్ దినం నేపథ్యంలో క్యాన్సర్ అంటే ఏమిటీ.? ఎలా ఏర్పడుతుంది.? ఏయే క్యాన్సర్లను ఎలా గుర్తించాలి, తదితర అంశాలను తెలుసుకుందాం..
క్యాన్సర్ అంటే..?
శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే, శరీరంలో ఎకడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ, చనిపోతూ ఉంటాయి. శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అంతేగాక ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కన్నా ఎకువగా వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్ (కణితి)గా ఏర్పడతాయి. దీన్నే క్యాన్సర్ అంటారు.
కణితులు రెండు రకాలు
ఈ కణితులు రెండు రకాలుగా ఏర్పడుతాయి. క్యాన్సర్ రహిత కణితి వల్ల ప్రమాదం ఉండదు. ఇది శరీరంలో ఒక చోట మాత్రమే పెరుగుతుంది. తొలగించిన తర్వాత మళ్లీ రాదు. క్యాన్సర్ కణితి మాత్రం రక్తం ద్వారా ఇతర కణాలకు వ్యాపిస్తుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి. అలసట, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, చర్మంలో గడ్డలు , శరీరం బరువులో మార్పులు, చర్మం రంగు మారడం, దీర్ఘకాలిక దగ్గు వంటి సమస్యలను క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించవచ్చు. శరీరంలో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్లకు వివిధ లక్షణాలు కనిపిస్తుంటాయి. వాటి గురించి కూడా తెలుసుకుంటే మరింత జాగ్రత్తగా ఉండవచ్చు.
బ్రెస్ట్ క్యాన్సర్ ..
మహిళల్లోనే ఎకువగా వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు పురుషులనూ కలవరపెడుతోంది. రొమ్ములపై నొప్పిలేని గడ్డలు ఏర్పడినా, మార్పులు కనిపించినా అప్రమత్తం కావాలి. ఈ గడ్డలు గట్టిగా, క్రమరహితంగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఏర్పడినట్లే రొమ్ముల్లో వాచినట్లు కనిపిస్తాయి. రొమ్ములు, చనుమొనలు నొప్పి పుడతాయి. చనుమొనల నుంచి స్రవాలు కారడం, లోపలికి కుచించుకుపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలను రొమ్ము క్యాన్సర్గా అనుమానించాలి. రొమ్ములపై చర్మం ఎర్రగా కందిపోయినా, ఇరిటేషన్ కలిగించినా జాగ్రత్తపడాలి.
సిన్ క్యాన్సర్ ..
చర్మంపై అసాధారణ మచ్చలు, గడ్డలు, పుండ్లు ఏర్పడినట్లయితే అప్రమత్తం కావాలి. చంకల్లో గట్టి గడ్డలు లాంటివి ఏర్పడినా, చర్మంపై ప్రమేయం లేకుండా దద్దుర్లు, పుట్టు మచ్చలు పెరగుతున్నా చర్మ క్యాన్సర్గా అనుమానించాలి. చర్మ క్యాన్సర్లు మూడు రకాలు. బాసల్ సెల్ సిన్ క్యాన్సర్ (బీసీసీ), స్వామస్ సెల్ సిన్ క్యాన్సర్ (ఎస్సీసీ), మెలనోమా క్యాన్సర్. బాసల్ సిన్ క్యాన్సర్ను సులువుగా నయం చేయవచ్చు. స్వామస్ సెల్ సిన్ క్యాన్సర్ను నయం చేయడం చాలా కష్టం. మెలనోమా క్యాన్సర్ ప్రమాదకరం. పుట్టుమచ్చల రంగు, ఆకారం, పరిమాణం మారడం ఈ వ్యాధి లక్షణాలు. కొత్తగా పుట్టుమచ్చలు రావడం, నొప్పి, దురద, పుట్టు మచ్చల చుట్టూ చర్మం ఎర్రగా కందిపోవడం, రక్తం కారడం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
లంగ్ క్యాన్సర్..
ఊపిరితిత్తుల క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడం కష్టం. వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు పాకిన తర్వాతే ఇది బయటపడుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు తెలిపారు. కొన్ని లక్షణాలతో ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని పేరొన్నారు. మాటలో అసాధారణ మార్పులు, ఛాతి నొప్పి, వేగంగా బరువు కోల్పోవడం, దగ్గు ఆగకుండా రావడం, బలంగా శ్వాస తీసుకోలేకపోవడంతో పాటు నవ్వినా, దగ్గినా నొప్పి రావడం, గురక లాంటి సమస్యలతో లంగ్ క్యాన్సర్ను పసిగట్టవచ్చు. ఈ క్యాన్సర్ ముదిరితే శ్వాస ఆడకపోవడం, దగ్గినప్పుడు రక్తం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తున్నప్పుడు తలనొప్పి, ఎముకల్లో నొప్పి, నీరసం, మెడ, పై భాగాల్లో గడ్డలు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, చర్మం, కళ్లకు ఈ వ్యాధి సంక్రమించే కొద్దీ ఆయా భాగాలు పాలిపోతాయి. ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ప్రోస్టేట్ క్యాన్సర్ (మూత్రాశయం)..
ప్రోస్టేట్ అంటే వీర్యగ్రంథి. ఇది వాల్నట్ తరహాలో ఉంటుంది. ఇదే పురుషుల్లో వీర్యాన్ని తయారు చేస్తుంది. వాస్తవానికి పురుషుల్లో క్యాన్సర్ ముప్పు చాలా తకువ. అయితే, ప్రోస్టేట్ క్యాన్సర్ (మూత్రాశయ క్యాన్సర్) మాత్రం తెలియకుండానే పెరిగిపోతుంది. ముందుగా ఈ గ్రంథిలోనే క్యాన్సర్ కణం ఏర్పడుతుంది. ఆలస్యం చేస్తే అది మిగతా భాగాలకు సోకవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్యాన్సర్ సోకిన బాధితుల్లో మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. మూత్రం, వీర్యంలో రక్తం కనిపిస్తే అప్రమత్తం కావాలి. పొత్తి కడుపు, ఎముకల్లో నొప్పి, కీళ్ల వాపు ఈ క్యాన్సర్కు సంకేతాలు. 50 ఏళ్లు నిండిన ప్రతి ఒకరూ ప్రొస్టేట్ స్రీనింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్యాన్సర్ ముదిరితే అంగస్తంభన సమస్యలు వస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉన్నా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని వెంటనే గుర్తించకపోతే ఎముకలు, ఊపిరితిత్తులు ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తుంది.
కొలోన్, రెక్టం క్యాన్సర్ (పెద్ద పేగు)..
కొలొరెక్టల్ క్యాన్సర్ కొలోన్ (పెద్దపేగు)లో, రెక్టం(పురీష నాళం)లోగానీ మొదలవుతుంది. అది పెద్ద పేగులో ఏర్పడితే కొలోన్ క్యాన్సర్ అని, పురీష నాళం వద్ద మొదలైతే రెక్టం క్యాన్సర్ అని పిలుస్తారు. ఎకడ ప్రారంభమైందన్న దాన్ని బట్టి కొలోన్ కాన్సర్, రెక్టం కాన్సర్ అని పిలుస్తారు. కొలోన్ క్యాన్సర్, రెక్టం కాన్సర్ను కలిపి కొలొరెక్టల్ క్యాన్సర్ అంటారు. వీటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అలహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్నా, సరైన ఆహారం తీసుకోకపోయినా ఈ క్యాన్సర్ వస్తుంది. దీనికి లింగ బేధం ఉండదు. ఈ క్యాన్సర్ వల్ల స్త్రీల కంటే ఎకువగా పురుషులే చనిపోతున్నారు. ఈ క్యాన్సర్ లక్షణాలు అంత త్వరగా బయటపడవని, 40 పైబడిన పురుషులు తప్పకుండా స్రీనింగ్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీ క్యాన్సర్ (మూత్రపిండాలు)..
ఈ క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్న వారిలో మూత్రంతో పాటు రక్తం వస్తుంది. అలసటగా అనిపిస్తుంటుంది. ఆకలి మందగిస్తుంది. కాలి మడమలు, కాళ్లు వాచిపోతాయి. బీపీ ఎకువగా ఉంటుం%A