మానకొండూర్ రూరల్, నవంబర్ 8: క్రీడా పోటీల్లో క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సూచించారు. మానకొండూర్ మండలం అన్నారం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడుతూ, క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతకు ముందు కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు బొట్ల కిషన్, రొడ్డ పృథ్వీరాజ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ పురం అనిల్కుమార్, నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, పిట్టల మధు, రాయికంటి కిరణ్, తిరుపతి గౌడ్, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.