కమాన్చౌరస్తా, నవంబర్ 8: తన మాటలతో ఎందరికో ప్రేరణదాయకంగా నిలిచి, తన మాట, పాటతో వేలాది మందిని కట్టిపడేసేలా చేసిన గొప్ప వ్యక్తి నంది శ్రీనివాస్ అని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ పేర్కొన్నారు. తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వ్యాఖ్యాన రంగంలో విశేష కృషి చేసిన వారికి సినారే వాగ్భూషణ పురసారం అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ కవి, పండితుడు, వ్యాఖ్యాత నంది శ్రీనివాస్కు పురస్కారం ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ మాట్లాడుతూ, నంది శ్రీనివాస్ మాట ఎందరో జీవితాలకు ప్రేరణగా నిలిచిందని, తాను వ్యాఖ్యానం చేస్తే ఆ సభ ఎంతో ఉల్లాసవంతంగా సాగిపోతుందన్నారు. తాను పాట పాడితే వేల మంది ఉర్రూతలూగిపోతారన్నారు. అలాగే, తెలంగాణ కళావేదిక అధ్యక్షుడు అనుముల దయాకర్, పురసార కమిటీ కన్వీనర్ దాస్యం సేనాధిపతి, గాజుల రవీందర్ తదితరులు మాట్లాడారు.
అనంతరం పురసార గ్రహీత నంది శ్రీనివాస్ మాట్లాడుతూ, సినారే వాగ్భూషణ పురసారానికి ఎంపికవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సినారే వంటి మహానుభావుడి పేరు మీద ఈ పురసారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ కవి దాస్యం సేనాధిపతి రాసిన లేడీ టీచర్ కవిత ఆధారంగా తీసిన లఘు చిత్రాన్ని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఆవిషరించి, ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, పాక రాజమౌళి, సౌగాని కొమురయ్య, డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, పాక రాజమౌళి, కేబీ శర్మ, గంగుల శ్రీకర్, అన్నాడి గజేందర్ రెడ్డి, డా. ఆవుల మల్లారెడ్డి, వినోద్కుమార్ శాస్త్రి, వైరాగ్యం ప్రభాకర్, మచ్చ హరిదాస్, అశోక్ కుమార్, అన్నవరం శ్రీనివాస్, గోనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.