జగిత్యాల అర్బన్, నవంబర్ 8: ప్రజలు ఆరోగ్య విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో జిల్లా జనరల్ దవాఖానలో పాలియేటివ్ క్రిటికల్ కేర్ యూనిట్ను మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. క్యాన్సర్ను ముందు గా గుర్తించడం ద్వారా సరైన చికిత్స చేయవచ్చని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుందని చెప్పారు. ఆలన కార్యక్రమం ద్వారా మంచానికే పరిమితమైన రోగులకు వాహనంలో ఇంటివద్దకే వైద్య సేవలు అందించే సదుపాయం ఉందన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుతో త్వరలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. మెడికల్ కాలేజీ చుట్టూ రహదారి నిమిత్తం రూ.10కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. జిల్లా దవాఖానలో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక్కడ జిల్లా వైద్యాధికారి శ్రీధర్, సూపరింటెండెంట్ రాములు, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, అర్ఎంఓ శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు మొగిలి, భోగ ప్రవీణ్, కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, కూసరి అనిల్, నవీన్, గంగాసాగర్, జగదీష్, గంగమల్లు, నారాయణ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అరిఫ్, నాయకులు ఫిరోజ్, లవంగ రాజేందర్, దాసరి ప్రవీణ్, లక్ష్మణ్, శ్రీనివాస్, గంగాధర్, మహేశ్ ఉన్నారు.