కథలాపూర్, అక్టోబర్ 22 : గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని సెర్ప్ ఏపీఎం నరహరి పేర్కొన్నారు. శనివారం కథలాపూర్ మండలకేంద్రంలో స్త్రీశక్తి భవన్లో వీవోఏ, సీసీ, సీఆర్పీలకు వరి కొనుగోళ్లపై శిక్షణ ఇచ్చారు. మండలంలో కథలాపూర్, భూషణరావుపేట, పెగ్గెర్ల, చింతకుంట, తాండ్య్రాల, పోతారం, బొమ్మెన, అంబారిపేట, దూలూర్ గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యంలో 17 తేమశాతం ఉంటేనే తూకం వేయాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,060, సాధారణ రకానికి రూ. 2,040 మద్ధతు ధర ఉంటుందని రైతులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో సీసీలు అంజయ్య, విజయనిర్మల, అశోక్, రమేశ్ పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్, అక్టోబర్ 22 : జగిత్యాల మండల సెర్ప్ కార్యాలయంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందికి శనివారం శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం వీ గంగాధర్ మాట్లాడుతూ జగిత్యాల రూరల్ మండలంలో 18 కొనుగోలుకేంద్రాలు, అర్బన్ మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఈ సీజన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. అనంతరం కమిటీ సభ్యులకు మారెటింగ్ కరపత్రాలు, పోస్టర్స్, పుస్తకాలు, రిజిస్టర్లు అందజేశారు. ఇక్కడ సీసీలు విద్యాసాగర్, గంగారాం, రవీందర్, సంతోష్, ఆయా కేంద్రాల కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
పెగడపల్లి, అక్టోబర్ 22 : మండలంలో 25 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెగడపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో వెంగళాయిపేట, పెగడపల్లి, సుద్దపల్లి, మద్దులపల్లి, దోమలకుంట, లింగాపూర్, శాలపల్లి, ఆరవల్లి గ్రామాల్లో మొత్తం 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం చైర్మన్ వోరుగంటి రమణారావు, సీఈవో గోపాల్రెడ్డి పేర్కొన్నారు. నంచర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో రాంనగర్, నంచర్ల, కీచులాటపల్లి, ఎల్లాపూర్, దేవికొండ గ్రామాల్లో మొత్తం 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, సీఈవో మధుకర్ తెలిపారు. నందగిరి సహకార సంఘం ఆధ్వర్యంలో ఐతుపల్లి, నందగిరి, నామాపూర్, మ్యాకవెంకయ్యపల్లిలో మొత్తం 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం చైర్మన్ కర్ర భాస్కర్రెడ్డి, సీఈవో రవీందర్రెడ్డి వివరించారు. మండల సెర్ప్ (ఐకేపీ) ఆధ్వర్యంలో బతికపల్లి, మద్దులపల్లి, రాములపల్లి, ల్యాగలమర్రి, రాజారాంపల్లి, రాంభదృనిపల్లి, నర్సింహునిపేట, నామాపూర్ గ్రామాల్లో మొత్తం 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎం డీ సమత పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని కళ్లాల వద్దే ఆరబొట్టుకుని తీసుకురావాలని సూచించారు.