కోరుట్ల రూరల్, అక్టోబర్ 22: అంతర్రాష్ట్ర ట్రా న్స్ఫార్మర్ల దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. కోరుట్ల ఠాణాలో శనివారం వివరాలు వెల్లడించారు. కోరుట్ల, గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీ జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, కోరుట్ల, కథలాపూర్, మెడిపెల్లి ఎస్ఐలు సతీశ్, శ్యాం రాజ్, రామచంద్రం, సుధీర్రావుతో కూ డిన పోలీసు బృందం దొంగల కోసం గాలించారు. మేడిపెల్లి మండలంలోని కొం డాపూర్ వెళ్లే దారిలో అనుమానితులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన పల్లిపాటి ఏసుదాస్, మన రాష్ట్రం మెదక్ జిల్లా శాలిపేటకు చెందిన నర్ర శ్రీధర్గా గుర్తించామన్నారు.
ఏసుదాస్ హైదరాబాద్లో సెంట్రింగ్ పని చేస్తున్నాడని, శ్రీధర్ నిజామాబాద్ జిల్లా మెండోరా వద్ద పశువుల కాపరిగా పని చేసి హైదరాబాద్కు వెళ్లాడన్నారు. హైదరాబాద్ లోవీరిద్దరితో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో కలిసి జల్సాలకు అలవాటు పడి అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం నుండి నిజామాబాద్ జిల్లాలోని బాలొం డ, ఆర్మూర్, మోర్తాడ్, కమ్మరిపేట, నందిపేట, ఏర్గట్ల, జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పెల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, ధర్మపురి, హుజూరాబాద్ లో పగటి పూట మోటార్ సైకిల్పై రెకీ నిర్వహించి రాత్రి సమయాల్లో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడేవారని పేర్కొన్నారు.
దొంగిలించిన కాపర్ వైర్ను వేరు వేరు ప్రాంతాల్లో దాచిపెట్టే వారన్నారు. నిందితుల నుంచి రూ.20 ల క్షల విలువైన కాపర్ వైర్, ఒక మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చే సుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న మెట్పెల్లి డీఎస్పీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, కోరుట్ల, కథలాపూ ర్, మేడిపల్లి ఎస్ఐలు సతీశ్, శ్యామ్ రాజ్, రామచంద్రం, సుధీర్ రావు, పోలీస్ సిబ్బంది పురుషో త్తం, చంద్రశేఖర్, హలీమ్ను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించి రివార్డులు అందజేశారు.