సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 12: అమాత్యుడు కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఆదుకుంటామని అభయమిచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన విలేకరి వినోద్రావుకు అభయమిచ్చారు. మంత్రి చొరవతో వినోద్రావును నిమ్స్లో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మంత్రి పీఏ కుంభాల మహేందర్రెడ్డి, కార్యాలయ బృందం సభ్యుడు కాసర్ల ప్రవీణ్ రెడ్డి దవాఖానకు వెళ్లి వినోద్ ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించేలా మంత్రి కేటీఆర్ సూచించారని వైద్యులకు చెప్పారు. అధైర్యపడవద్దని కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.
వినోద్రావు 20 ఏండ్లుగా సిరిసిల్లలో ఉంటూ ఓ దినపత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) విలేకరిగా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు, ఆ తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. వినోద్ పరిస్థితిని పలువురు జర్నలిస్టులు, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి స్పందించి, మెరుగైన వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే వినోద్రావును నిమ్స్ దవాఖానలో చేర్పించారు. వైద్య ఖర్చులకు అవసరమైన ఎల్వోసీని అందజేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు పీఏ మహేందర్రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు, జర్నలిస్ట్లతో పాటు పలువురు వినోద్ రావు కుటుంబానికి అర్థిక సాయం అందించారు. ఆపదలో ఆదుకున్న కేటీఆర్కు వినోద్ రావు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.