పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 12 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులు 70లక్షలతో పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మించిన ఎనిమిది అదనపు తరగతి గదులను బుధవారం ఎమ్మెల్యే దాసరితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్కుమార్, ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, డీఈవో మాధవి, ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ, ఎస్ఎంసీ చైర్మన్ సతీశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.