కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 8: రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. అ నేక మంది తమ వాహనాలను ఇండ్లకే పరిమితం చేసి బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనికితో డు కాలుష్యం కూడా మితిమీరి పోతుండడంతో ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారుల ఆసక్తి మేరకు పలు కంపెనీలు వివిధ మోడళ్లలో వాహనాలను తీసుకురావడం, రాష్ట్ర సర్కారు సైతం ప్రోత్సహిస్తుండడంతో వీటి విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి.
ఈ వాహనాలు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా, వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ప్రభు త్వం వెసులుబాటు కల్పించింది. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలు దర్శనమిస్తున్నాయి. తమ అవసర నిమిత్తం వాహనదారులు ఎలాంటి శబ్ద కాలుష్యం కూడా చేయకుండా రయ్మంటూ దూ సుకెళ్తున్నారు. ఒకసారి చార్జింగ్ చేస్తే కనీసం 100 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉండడంతో, పరిసర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చిపోయే వారు కూడా వీటిని విరివిగా వినియోగిస్తున్నారు.
చార్జింగ్ కోసం ఈవీ స్టేషన్లు..
వాహనాలు రయ్య్మ్రంటూ దూసుకెళ్తున్నప్పటికీ వినియోగదారులను చార్జింగ్ భయం వెంటాడుతున్నది. మార్కెట్లో మోడల్ను బట్టి ఒక్కోటి 50కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వాహనాలు ఉన్నప్పటికీ పెరిగిన ప్రయాణాలతో చార్జింగ్ చేయడం సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో వారి అభ్యర్థన మేరకు తెలంగాణ సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నగరంలో పబ్లిక్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. నగరంలోని పలు ప్రాంతాలు గుర్తించి ఆయాచోట్ల ఈవి చార్జింగ్ సెంటర్లు ఇన్స్టాలేషన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతి లొకేషన్లో ఫాస్ట్ స్పీడ్, స్లోస్పీడ్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రెడ్కో డీఎం పేర్కొన్నారు.
గుర్తించిన ప్రాంతాలు ఇవే..
నగరంలోని జ్యోతినగర్లోని మోర్ సూపర్మార్కెట్ ఎదురుగా మున్సిపల్ పార్కు పక్కన, జడ్పీ క్వార్టర్స్లో, కమాన్ బస్టాండ్కు ఎదురుగా, మె యిన్ బస్టాండ్ ముందు, మాతాశిశుసంరక్షణ కేం ద్రం పక్కన, ఉమెన్స్ డిగ్రీ కళాశాల సమీపం లో, సంగీత మొబైల్ పక్కన, కలెక్టరేట్ క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఇరిగేషన్ స్థలం లో, ఆర్టీసీ వర్క్షాప్ పక్కన ఆర్టీసీ దవాఖాన ప్రాంగణంలో, ఆర్ట్స్ కళాశాల మైదానంలో, కలెక్టరేట్, రాంనగర్లోని మార్క్ఫెడ్ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో, బొమ్మకల్ బై పాస్ రోడ్డులో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కు ప్రతిపాదనలు అందజేశారు. అయితే, ఆయా ప్రాంతాల్లో గుర్తించిన మేరకు భూమి రెవెన్యూ శాఖ నుంచి టీఎస్ రెడ్కోకు అప్పగించాల్సి ఉంది. ఎన్వోసి ఇచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన చార్జింగ్ స్టేషన్లు ఇన్స్టాలేషన్ చేయనున్నారు.
స్థలం అప్పగిస్తే ఇన్స్టాల్ చేస్తాం..
కాలుష్య నివారణకు తోడు, చమురు ధరల బారి నుంచి వాహనదారులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సూచనతో జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం ఈ వాహనాలు 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతున్నాయి. జిల్లా కేంద్రం లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే, ఈవీ వా హనదారులకు మరింత సౌలభ్యంగా ఉ ంటుంది. 200 కిలోమీటర్ల దాకా తిరిగే అవకాశముంటుంది. చార్జింగ్ సెంటర్ల ఇన్స్టాలేషన్కు అనువైన స్థలాన్ని ఎంపిక చేశాం. రెవెన్యూ యం త్రాంగం భూమి అప్పగిస్తూ, ఎన్వోసీ ఇచ్చిన వెంటనే చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
– పరమాచారి, టీఎస్రెడ్కో డీఎం