హుజూరాబాద్ రూరల్, జనవరి 23: చెల్పూర్ ప్రభుత్వ పాఠశాల అవరణలో ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ నేరేళ్ల మహేందర్గౌడ్, జూపాక సింగిల్ విండో చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, వ్యవసాయ కమిటీ డైరెక్టర్ మండల సాయిబాబా, మాట్ల రమేశ్, నరేందర్, రాజేందర్, అనిల్, ప్రవీణ్రెడ్డి, యూత్ నాయకులు ఉన్నారు.
వీణవంకలో..
మండలంలోని చల్లూరు, ఎలుబాకలో ఆదివారం భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రామిడి ఆదిరెడ్డి, నరసింహరాజు, రవీందర్, శ్రీనాథ్, గోపీనాథ్, ప్రశాంత్, నారాయణదాసు సాయినాథ్, పొన్నాల అనిల్కుమార్, పోల ఓదెలు, మాడ శ్రీనివాస్రెడ్డి, సతీశ్, వేణు, నల్లగోని శ్రీకాత్, కుమార్, భూపతిరెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
హుజూరాబాద్లో..
స్వాతంత్ర ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నేతాజీ సుభాష్చంద్రబోస్ మహనీయుడని బీజేపీ పట్టణాధ్యక్షుడు గంగిశెట్టి ప్రభాకర్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలను పట్టణంలోని అంబేదర్ చౌరస్తా, మారుతినగర్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలుర్పించారు. ఇక్కడ నాయకులు పల్లేని దేవేందర్రావు, అయిత హరీశ్, పృథ్వీరాజ్, మనోజ్, వీ విజయ్, హరీశ్, కేశవ్, వేణు, విక్రమ్, ఉమాశంకర్, శివమణి, చంద్ర ఉన్నారు.
మానకొండూర్లో..
గంగిపల్లిలో ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఎంపీటీసీ రంగు భాస్కరాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన ముల్కల శ్యాంసుందర్ పెద్దపల్లి జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించినందుకు శాలువాతో సన్మానించి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బండ రాజు, ఆకుల సాగర్, ముల్కల శ్యాం, మూల హరీశ్, కాసిడి రాజు, జినుక చిరంజీవి, యామ సంపత్, బుర్ర రాకేశ్, సురేశ్ పాల్గొన్నారు.
తిమ్మాపూర్లో..
తిమ్మాపూర్ రూరల్, జనవరి 23: నేతాజీ సుభాష్చంద్రబోస్ జయంతి వేడుకలు మండల వ్యాప్తంగా నిర్వహించారు. రామకృష్ణకాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సుభాష్నగర్లో నేతాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నేతాజీ స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసి, చరిత్రలో నిలిచిపోయిన యోధుడని మండలాధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో తమ్మిశెట్టి మల్లయ్య, పబ్బ తిరుపతి, వైద్యుల వెంకట్రెడ్డి, బోనాల మోహన్, ఎర్రోజు లక్ష్మణ్, కంది రాజేందర్రెడ్డి ఉన్నారు.