కరీంనగర్ రూరల్, ఆగస్టు 8: కరీంనగర్ రూరల్ మండలంలో 4389 జాతీయ జెండాలను పంపిణీ చేసినట్లు ఎంపీవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం వజ్రోత్సవాల సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. 17 గ్రామాల్లో 12,210 ఇండ్లు ఉండగా, మొదటి విడుతలో 4,389 జాతీయ జెండాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామాల వారీగా బహ్దూర్ఖాన్పేటలో 89, బొమ్మకల్లో 1285, చామనపల్లి లో 319, నగునూర్లో 548, నల్లకుంటపల్లిలో 52, తాహెర్ కొండాపూర్లో 43, ఫకీర్పేటలో 47, గోపాల్పూర్లో 306, ఇరుకుల్లలో 136, జూబ్లీనగర్లో 122, మందులపల్లిలో 50 , మొగ్దుంపూర్లో 327, చేగుర్తిలో 184, చెర్లభూత్కూర్లో 306, దుబ్బపల్లిలో 72, దుర్శేడ్లో 372, ఎలబోతారంలో 131 జెండాల చొప్పున పంపిణీ చేశారని వెల్లడించారు. రెండో విడుతలో గ్రామాలకు సరిపడా జెండాలు వస్తాయనే ఆశాభావాన్ని ఎంపీవో వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మండలానికి చేరిన జాతీయ పతాకాలు
ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామాల్లో ఇండ్లపై ప్రజలు ఎగుర వేయడానికి కావాల్సిన జాతీయ పతాకాలు సోమవారం గంగాధర మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నాయి. ఎంపీడీవో భాస్కర్రావు, ఎంపీవో జనార్దన్రెడ్డి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు జాతీయ జెండాలను అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై ప్రజలు జాతీయ జెండాను ఎగురవేసేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.